పేలుళ్లు మా పనే: ఇండియన్ ముజాహిదీన్


లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బాంబు పేలుళ్లు తమ పనేనని ఇండియన్ ముజాహిదీన్ అనే సంస్థ ప్రకటించుకుంది. ఈ మేరకు మీడియా కార్యాలయాలకు ఇ- మెయిల్స్ వచ్చినట్లు ప్రైవేట్ టీవీ చానెల్స్ వార్తను ప్రసారం చేశాయి. ఫ్రెంచ్ ఐడితో ఈ మెయిల్స్ వచ్చినట్లు ఆ వార్తా కథనం పేర్కొంది. పోలీసులను లక్ష్యంగా ఎంచుకుని బాంబులు పేల్చినట్లు ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించుకుంది.

వారణాసి, లక్నో, ఫైజాబాదుల్లో జరిగిన బాంబు పేలుళ్లలో 8 మంది మాత్రమే చనిపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. లక్నో పేలుడులో ఎవరూ చనిపోలేదని చెబుతున్నారు. అయితే మృతులు 25 మంది దాకా ఉంటారని అనధికారవర్గాల అంచనా. న్యాయవాదుల దాడికి ప్రతీకారంగానే ఈ పేలుళ్లు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పేలుళ్ల నేపధ్యంలో ఢిల్లీ, ముంబయి, హైదరాబాదుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+