వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఎంపీపీని కాల్చి చంపిన నక్సల్స్

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో మావోయిస్టులు ఈ ఉదయం ఆమనగల్ ఎంపీపీ పంతూ నాయక్ ను కాల్చి చంపారు. మైసిగండి గుడి వద్ద అతి సమీపం నుంచి నాయక్ ను కాల్చి చంపారు. ఆయన శివదీక్షలో ఉన్నారు. మైసిగండి దగ్గర జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు నక్సల్స్ పాల్గొన్నట్టు సమాచారం. కాల్పులు జరిపిన క్షణాల్లో ఆయన కుప్పకూలారు. ప్రదక్షిణ చేస్తుండగా ఈ కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం నక్సల్స్ ఒక లేఖను సంఘటనా స్థలంలో వదిలారు. అందులో తాము సిపిఐ మావోయిస్టు కార్యకర్తలమని రాసి ఉంది. మహబూబ్ నగర్ జిల్లా మావోయిస్టు కార్యదర్శి సంతోష్ కిరణ్ పేరిట సంతకంతో ఈ లేఖ ఉంది. కాగా పంతూ నాయక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపి. ఈ ఘటనకు ఆగ్రహించిన స్థానికులు శ్రీశైలం రహదారిపై బైఠాయించారు. ట్రాఫిక్ పెద్ద యెత్తున జామ్ అయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X