మాజీ ఎంపీ తేళ్ళ లక్ష్మీకాంతమ్మ కన్నుమూత
విజయవాడ: స్వాతంత్ర్య సమరయోధురాలు, సీనియర్ రాజకీయ నాయకురాలు తేళ్ళ లక్ష్మీ కాంతమ్మ గురువారం ఉదయం విజయవాడలో కన్ను మూశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు ఎన్నికైన ఆమె వయసు 82 ఏళ్ళు. ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత ఆమె మనవరాలే.
లక్ష్మీకాంతమ్మ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సన్నిహితురాలు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వైఖరిని బహిరంగంగా విమర్శించి ఆమె ఆ కాలంలో వార్తలకు ఎక్కారు. ఆమె హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు.












Click it and Unblock the Notifications
