వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల కోసం పార్టీ కార్యాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సామాజిక సేవే ధ్యేయంగా మనం పని చేయాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. చంద్రబాబు కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్ద యెత్తున పాల్గొన్నారు.
హైదరాబాదులోని మాసాబ్ ట్యాంకులో గల రాక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన చర్చిలో గడిపారు. పిల్లలు వేసి క్రీస్తు జన్మ నాటకం ప్రేక్షకులను అలరించింది. హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాల్లోని చర్చిల్లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
Story first published: Tuesday, December 25, 2007, 23:53 [IST]