వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బేనజీర్ హత్యపై ప్రపంచం దిగ్భ్రాంతి

By Staff
|
Google Oneindia TeluguNews

Benajir Bhutto
రావల్పిండి: పాకీస్ధాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో దారుణ హత్యకు గురయ్యారు. గురువారం సాయం త్రం రావల్పిండిలో పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ ఎన్నికల ర్యాలీలో పాల్గొని తిరిగివెళుతున్న ఆమె దుండగుల దాడికి బలయ్యారు. ఇక్కడి లియాఖత్ అలీ పార్క్ లో జరిగిన ర్యాలీలో ప్రసంగింఛిన అనంతరం బేనజీర్ కారు ఎక్కుతుండగా కొందరు దుండగులు రైఫిళ్ళతో ఆమెపై కాల్పులు జరిపారు.

ఈ విషయం తెలిసిన ప్రపంచ దేశాలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఒక ధైర్యశీలి అయిన మహిళా నేతను ప్రపంచం కోల్పోయిందని, ఈ లోటు ఏనాటికి పూడ్చలేనిదని ప్రపంచ దేశాలు వ్యాఖ్యానించాయి. ఉగ్రవాదం పోరులో తన ప్రాణాలు అర్పించిన భుట్టోకు ప్రముఖ నేతలందరు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భుట్టో హత్యా ఉదంతంపై భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ భారత ఉపఖండం అసాధారణ ప్రజాస్వామ్య నాయకురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భుట్టో హత్యకు కారణమైన తీవ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రపంచదేశాలు ముందుకు రావాలని వ్యాఖ్యానించారు. భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ బెనజీర్ హత్యపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సమాజ సుస్థిరతకు ఉగ్రవాదం పెనుముప్పుగా తయారైందని అన్నారు. బెనజీర్ దారుణహత్యను అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్ తీవ్రంగా ఖండించారు. బెనజీర్ హత్య వెనుక ఉన్న అరాచక శక్తుల్ని చట్టం ముందు ప్రవేశపెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా దేశంలో బెనజీర్ అడుగుపెట్టారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్న లక్ష్య సాధనలో ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారని కీర్తించారు. ఆమె ఆశయాల్ని కొనసాగించాలని ఆయన పాక్ ప్రజలకు పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X