కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పీజేఆర్ హఠాన్మరణం

ఈ ఉదయం గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవంలో పీజేఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. గురువారంనాడు నారాయణగూడలో జరిగిన పార్కు ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం అందలేదు. ఈ విషయాన్ని హిమాయత్ నగర్ ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి ధృవీకరించారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నప్పటికీ ఆయనకు సరైన స్థానం కల్పించకపోవడంతో ఆయన చాలా కాలంగా తీవ్ర వత్తిడికి గురవుతున్నారు. తాజాగా బుధవారంనాడు ఆయన సూరీడుపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ధైర్యంగా సిబిఐని ప్రశ్నించాడు. ఇవన్నీ ఆయనకు తీవ్ర వత్తిడి కలిగించి గుండెపోటు రావడానికి కారణమైన అంశాలని అభిమానులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
పీజేఆర్ మరణించారన్న వార్త విని అన్ని పార్టీల నాయకులు ఆసుపత్రికి చేరుకుని నివాళులు ఆర్పించారు. ముఖ్యమంత్రి, వైయస్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, షబ్బీర్ అలీ తదితరులు పీజేఆర్ భౌతిక కాయాన్ని సందర్శించారు. హన్మంతరావు బోరున విలపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణా నేత కేశవరావు జాదవ్ తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని దోమల్ గూడలోని ఆయన స్వగృహానికి తరలించారు.












Click it and Unblock the Notifications
