కర్నూలు జిల్లాలో దారుణ హత్య
కర్నూలు: కర్నూలు జిల్లాలో ముఠా కక్షలు మరోసారి పడగ విప్పాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన భూమా నాగిరెడ్డి వర్గీయులు కాంగ్రెసుకు చెందిన గంగుల ప్రతాపరెడ్డి వర్గీయులపై దాడి చేశారు. ఈ దాడిలో గంగుల ప్రతాపరెడ్డి అనుచరుడు చిన్నదస్తగిరి రెడ్డి మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ఆళ్లగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సంఘటన కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం చాకలికాజకమలం గ్రామంలో జరిగింది. గంగుల ప్రతాపరెడ్డి వర్గీయులు ప్రయాణిస్తున్న వాహనాన్ని టాటా సుమోతో ఢీకొట్టి ఆ తర్వాత వేటకొడవళ్లతో దాడి చేశారు. దొర్నిపాడు నుంచి డబ్ల్యు కొత్తపల్లి వెళ్తండగా ఈ దాడి జరిగింది.












Click it and Unblock the Notifications
