పవన్ కళ్యాణ్ కు విడాకులు మంజూరు

వాస్తవానికి ఈ నెల 22వ తేదీన నందిని దాఖలు చేసిన మనోవర్తి కేసు విచారణకు రావాల్సి ఉంది. అయితే ఇరు పక్షాలు రాజీకి రావడంతో విచారణను ప్రీపోన్ చేసేందుకు కోర్టు అంగీకరించి మంగళవారం విచారణ చేపట్టింది. నందినికి ఐదు కోట్ల రూపాయల మనోవర్తిని చెల్లించేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు. దానికి నందిని కూడా అంగీకరించారు. ఈ నెల 17వ తేదీన చిరంజీవి పార్టీని అధికారికంగా ప్రకటించనున్న నేపథ్యంలో రాజీకి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. వ్యక్తిగత వివాదాలు ఉంటే పార్టీకి ఇబ్బందులవుతాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన విడాకుల వివాదాన్ని పరిష్కరించుకున్నారు.












Click it and Unblock the Notifications
