రాజమండ్రి: రాష్ట్రంలో మహా కూటమికి జరుగుతున్న ప్రయత్నాలు వల్ల తమకేమీ ఇబ్బంది లేదని ...వారికంటే 10 ఓట్లు ఎక్కువే వస్తాయని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాజమండ్రిలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తమను చూసి భయపడుతున్నారని ,కాంగ్రేస్ ని ఓడించటానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు. ఓ పత్రికాధిపతి, సిధ్ధాంతాలను నమ్ముకున్నాననే ఓ రాజకీయ నాయకుడు కూటమి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అయినా తమకు భయం లేదని అన్నారు. అలాగే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమని దాన్ని చంద్రబాబు కోల్పోయాడని ఆయన విమర్శించారు.