ప్రపంచ స్టీల్ సమాఖ్య అధ్యక్షుడిగా మిట్టల్
వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన లండన్వాసి, ప్రపంచ కోటీశ్వరుడు లక్ష్మీ నివాస్ మిట్టల్ ప్రపంచ స్టీల్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 180 ప్రముఖ స్టీల్ ఉత్పత్తి కంపెనీలు ఈ సమాఖ్యలో సభ్యులుగా ఉన్నాయి. ఆయన 2009 అక్టోబరు వరకు ఈ పదవిలో ఉంటారు. భారత్కు చెందిన జిందాల్ కంపెనీ కూడా ఈ సమాఖ్యలో అసోసియేట్ మెంబర్గా ఉంది.
అలాగే మిట్టల్ వరల్డ్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గాను ఎంపికయ్యారు. ఇక వరల్డ్ స్టీల్ కొత్త వైస్ ఛైర్మన్ గా కు-టక్ లీ ని ఎంపికచేసారు. గతసంవత్సరానికీ లీ నే ఛైర్మన్ గా ఎంపిక అవటం జరిగింది. అసోసియేషన్ వారు ఈ విషయాన్ని మీడియాకు వెళ్ళడిస్తూ ప్రకటన చేసారు. 1967 లో స్దాపించిన ఈ అశోసియేషన్ ప్రపంచమంతటా విస్తరించి 18 దేశాల సభ్యులతో..ఇరవై భారీ స్టీల్ కంపెనీలు రిప్రెజెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
