జనం కోసమే పార్టీ పెట్టాం: పవన్ కల్యాణ్

అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపిచ్చారు. ఇప్పుడున్న పార్టీలకు భిన్నంగా ప్రజారాజ్యాన్ని తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేసారు. జనంమీద బతికే నాయకులున్న ఈ రోజుల్లో జనంకోసమే అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టారని అన్నారు. అలాగే యువత అండదండలతో అన్ని ప్రజాసమస్యలను ప్రజారాజ్యం పార్టీ పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
పేదల కష్టాలను రూపుమాపేందుకే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి నెలకొల్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటే ప్రజారాజ్యం కార్యకర్తల్లో నూతన ఉత్యాహం వచ్చింది. అన్నయ్య చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూసేంతవరకు తాము విశ్రమించమని వారు ధీమాగా చెపుతున్నారు. ఇప్పటివరకు జంటనగరాల్లో స్తబ్దుగా ఉన్న పీఆర్పీ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.












Click it and Unblock the Notifications
