వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసిలకు ఛాంపియన్లం మేమే: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: వెనకబడిన తరగతులకు (బిసిలకు) తాము చేయూత ఇచ్చినంతగా మరెవరూ ఇవ్వలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సభలో ఆయన శుక్రవారం మాట్లాడారు. బడుగు వర్గాల కోసం తాము అంకిత భావంతో పని చేస్తున్నామని ఆయన చెప్పారు. బిసిలకు పూర్తి స్థాయి మేలు జరగాలంటే విద్యాపరమైన మేళ్లు చేయాలని, ఆ దిశగా తామెంతో చేస్తున్నామని, ఉపకార వేతనాలను తామే అందిస్తున్నామని ఆయన చెప్పారు. తాము ఫూలే స్ఫూర్తితో పని చేస్తున్నామని ఆయన చెప్పుకున్నారు. ఇంత పెద్ద యెత్తున బిసిలకు దేశంలో తమ ప్రభుత్వమే మేలు చేస్తోందని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం పార్టీ తరఫున జ్యోతిబా ఫూలే జయంతి సభ హైదరాబాదులోని ఇమేజ్ గార్డెన్ లో జరిగింది. మీలో జ్యోతిబా ఫూలే స్ఫూర్తి చాలా ఉందని, మీరు చెప్పింది ఇంత కాలం వింటూ వస్తున్నానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. బిసిల మేలుకు ఏం చేయాలో కార్యాచరణను అందించాల్సింది కూడా మీరేనని ఆయన అన్నారు. బిసి నాయకులను మాట్లాడాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. కేంద్ర మాజీ మంత్రి పి. శివశంకర్ తదితరులు మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X