వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సొల్లు మాటలు వద్దు: మిత్రా
నెల్లూరు: బయట ఉంటూ సొల్లు మాటలు మాట్లాడే వారంతా ఒక్కసారి చిరు సభకు వచ్చి చూస్తే వారికి విషయం తెలిస్తుందని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్ర సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ బలహీనంగా ఉందని, చిరు సభకు ఎవరూ రారంటూ కొందరు రాజకీయ పార్టీ నాయకులు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు డాక్టర్ మిత్ర ఘాటుగా స్పందించారు. "చిరు సభకు వచ్చిన ఈ జనసమూహాన్ని చూసి వ్యంగ్యంగా మాట్లాడే ఆ నాయకులు ఇప్పుడు ఎవరు వీకో, ఎవరు స్ట్రాంగో తేల్చుకోవాలి'' అని అన్నారు.
Story first published: Tuesday, January 6, 2009, 10:00 [IST]