హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అంశంపై శ్రీనివాస్ ఉక్కిరి బిక్కిరి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పీసీసీ ఎన్నికల కమిటీ భేటీ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సంయుక్త కమిటీ ఏర్పాటుచేయనున్నట్లు నిన్న అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనపై విలేకరులు ప్రశ్నలు సంధించారు. వారికి రకరకాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఆయన చివరకు అసహనానికి లోనై తాను చెప్పేదేం లేదంటూ అక్కడినుంచి నిష్క్రమించారు. అసెంబ్లీ పూర్తయిన తరువాత కమిటీ ఎలా వేస్తారని ప్రశ్నించగా అసెంబ్లీ రద్దయ్యేంతవరకు వారు ఎమ్మెల్యేలేనని ఎందుకు వేయకూడదని ఆయన ఎదురు ప్రశ్నించారు.

తెలంగాణా కావాలో వద్దో ఇప్పుడు పదవీకాలం పూర్తయ్యేముందు అభిప్రాయాలు సేకరించి ఎలా చెబుతారని ప్రశ్నించగా ఈ కమిటీ తెలంగాణా కావాలో వద్దో చెప్పేందుకు కాదని, తెలంగాణా ఏర్పాటులో ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమించాలో, సమస్యలను ఎలా పరిష్కరించాలో, విధి విధానాలు ఏమిటో ఖరారుచేసేందుకు ఏర్పాటుచేశారని అన్నారు. అలా అయితే తెలంగాణా ఏర్పాటుకు తీర్మానం చేయవచ్చు కదా అని విలేకరులు ప్రశ్నించారు. ఆ తరువాత దానిపై పలు ప్రశ్నలు సంధించటంతో అసహనానికి లోనైన ఆయన అన్నీ మీరే చెబితే ఇక మేం చెప్పేది ఏముందంటూ లేచి వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X