తెలంగాణ అంశంపై శ్రీనివాస్ ఉక్కిరి బిక్కిరి
తెలంగాణా కావాలో వద్దో ఇప్పుడు పదవీకాలం పూర్తయ్యేముందు అభిప్రాయాలు సేకరించి ఎలా చెబుతారని ప్రశ్నించగా ఈ కమిటీ తెలంగాణా కావాలో వద్దో చెప్పేందుకు కాదని, తెలంగాణా ఏర్పాటులో ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమించాలో, సమస్యలను ఎలా పరిష్కరించాలో, విధి విధానాలు ఏమిటో ఖరారుచేసేందుకు ఏర్పాటుచేశారని అన్నారు. అలా అయితే తెలంగాణా ఏర్పాటుకు తీర్మానం చేయవచ్చు కదా అని విలేకరులు ప్రశ్నించారు. ఆ తరువాత దానిపై పలు ప్రశ్నలు సంధించటంతో అసహనానికి లోనైన ఆయన అన్నీ మీరే చెబితే ఇక మేం చెప్పేది ఏముందంటూ లేచి వెళ్లిపోయారు.
Comments
Story first published: Friday, February 13, 2009, 16:37 [IST]