ఐటి పార్కులో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని గచ్చిబౌలీ స్టేడియం సమీపంలో గల ఐటీ పార్కులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఐటీ పార్కు భవనం 8వ అంతస్తులో మధ్యాహ్నం చెలరేగిన మంటలు ఇతర అంతస్తులకు వ్యాపిస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదంతో అక్కడి ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Comments
Story first published: Monday, February 16, 2009, 16:14 [IST]