చెన్నైచేరిన రెహ్మాన్ కు జయహో

ఆయనకు తమిళనాడు ప్రభుత్వం తరపున సమాచారమంత్రి ఆయనకు స్వాగతం పలకగా డ్రమ్మర్ శివమణి తన ట్రూప్తో సంగీత స్వాగతం పలికి బయటకు తీసుకువచ్చారు. ఆయనకోసం అర్థరాత్రినుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు బయట వేచి ఉన్నారు. ఆయన రాగానే ఆయనపై పుష్పవర్షం కురిపించారు. జయహో అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా అభిమానులు, మీడియావారు ఆయనను చుట్టుముట్టి కదలటానికి వీల్లేని పరిస్థితి కల్పించారు. ఓ దశలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. పోలీసులు అదుపుచేశారు.
తనకు అవార్డు వస్తుందని, రావాలని తనకంటే ఎక్కువ ప్రజలు కోరుకున్నారని వారి అభిమానమే అవార్డుల రూపంలో ఫలించిందని రెహ్మాన్ అన్నారు. అక్కడినుంచి ఆయన కోడంబాకంలోని స్వగృహానికి చేరుకున్నారు. ముంబయి విమానాశ్రయంలో రసూల్ పోకుట్టి, నటుడు ఇర్ఫాన్ ఖాన్లకు ఘనస్వాగతం లభించింది. అభిమానులు పూలమాలలతో వారిని ముంచెత్తారు. ఆస్కార్ను పైకెత్తి చూపుతూ వారు తమకు లభించిన స్వాగతం అపూర్వమని అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. స్మైల్పింకీ టీమ్కు కూడా ఘనస్వాగతం లభించింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications