గాంధీభవన్ ఘటనలో మరొకరి మృతి
హైదరాబాద్: గాంధీభవన్పై ఎమ్మార్పీఎస్ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కె.సుబ్రమణ్యం రాజు (40) మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజు మరణవార్త తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, ప్రభుత్వ నేతలు ఆస్పత్రికి చేరుకొన్నారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించారు. రాజు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హోంమంత్రి జానారెడ్డి హామీ ఇచ్చారు.
ఈనెల 1వ తేదీన సుబ్రమణ్యంరాజు విధి నిర్వహణలో భాగంగా గాంధీభవన్లో భద్రతా విధులు నిర్వహిస్తున్న సమయంలో.. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ వైఖరికి నిరసనగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెట్రోల్, డీజిల్తో దాడి చేశారు. ఆ సమయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో.. రాజు దుస్తులపై పెట్రోల్, డీజిల్ చిందింది. వాటికి నిప్పంటుకుని తీవ్రంగా గాయపడ్డారు.
98శాతం కాలిన గాయాలతో కాంచన్బాగ్ అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సుబ్రమణ్యంరాజు బుధవారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో తుదిశ్వాస వదిలారు. ఈ దాడిలో పాల్గొని తీవ్రంగా గాయపడిన ఎమ్మార్సీఎస్ నాయకుడు సురేందర్ మాదిగ కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications