హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ పై టీడీపీ కంప్లైంట్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయంలోని సి బ్లాక్‌ కాన్ఫరెన్సు హాలులో మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్‌, ఆర్ధిక మంత్రి రోశయ్యలు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడాన్ని తెలుగు దేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిడిపి సీనియర్‌ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు నీతులు చెప్పడం కాదు ఆచరణలో చూపాలని వ్యాఖ్యానించారు. సచివాలయంలో ఇలా విమర్శలకు దిగటం కోడ్‌ ఉల్లంఘనే అవుతుందని దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో సచివాలయంలోని ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాల్లో, సమావేశపు హాలులో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు సాగించకూడదు. ప్రభుత్వ అతిథి గృహాలు, ఆలయాలు, పాఠశాలల్లో ఎలాంటి రాజకీయ ప్రచారం, సభలు నిర్వహించకూడదు. కాన్ఫరెన్సు హాలును ఎన్నికల ప్రచార వేదికగా ఉపయోగించుకోవడం ముమ్మాటికి నిబంధనలను ఉల్లంఘించడమేనని నిఘా వేదిక అభిప్రాయపడింది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.గత ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రులు నిబంధనల గీత దాటటంపై ఎన్నికల కమిషన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు కావటంతో ముఖ్యమంత్రి హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X