సీఎం బామ్మర్ధిననే...అన్యాయం

52 సంవత్సరాల వయసున్న తాను 32 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా...కడప అసెంబ్లీ సీటు దక్కించుకోలేకపోవడం మనస్తాపానికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి టికెట్ కేటాయించని పక్షంలో పార్టీని వీడాల్సి ఉంటుందని...ఈ పరిణామం ఏడుపు తెప్పిస్తోందని కన్నీరు కార్చారు. కడప అసెంబ్లీ స్థానం కేటాయించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. 'అన్నా, బాధపడొద్దు. మేమున్నాం' అని సహచర కార్పొరేటర్లు ధైర్యం చెప్పినా ఆయన కన్నీరు ఆగలేదు. దీంతో సాటి కార్పొరేటర్లు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.
తాను, తన సహచర కార్పొరేటర్లు సస్పెన్షన్ వేటుకు భయపడే ప్రసక్తే లేదని రవీంద్రనాథ రెడ్డి తెలిపారు. టికెట్రాని పక్షంలో రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని కార్పొరేటర్లకు సూచించారు. తాను ఇండిపెండెంట్గా ఉన్నా...కడప పార్లమెంటు అభ్యర్థిగా జగన్ రంగంలో ఉంటే ఆయన విజయానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఏదైమైనా తొలి అభ్యర్థి పేరునైనా ప్రకటించకముందే కాంగ్రెస్లో అసమ్మతి సెగలు రగులువటం ఆలోచించ తగ్గ అంశమే. అందులోనూ ఆ అసమ్మతి సెగ రవీంద్రనాధ్ స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ బావమరిది వైపు నుంచి రావటం ఏ విధమైన సంకేతాలనిస్తోందనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు..కడప టికెట్ రవీంద్రనాథరెడ్డికే ఇవ్వాలంటూ మంగళవారం నుంచి తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం.పి.సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications