వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎవడబ్బ సొమ్ము: చిరు ప్రశ్న
చిరంజీవికి రాజకీయం తెలియదని అంటున్నారని, రాజకీయమంటే వ్యసనం, వ్యాపారం అని తనపై వ్యాఖ్యలు చేస్తున్నవారి ఉద్దేశమని, అవే రాజకీయాలైతే ఆ రాజకీయాలు తనకు తెలియవని, ప్రజాసేవ చేయడమే రాజకీయమని మాత్రమే తనకు తెలుసునని ఆయన అన్నారు. ప్రజల కన్నీళ్లు, కడగగండ్లతో కాంగ్రెసు నాయకులు రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల పాటు సినీ నటుడిగా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని, తమకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారని ఆయన చెప్పుకున్నారు. ప్రజలతో తనకున్న అనుబంధం గుండెకూ గుండెకూ ఉన్న సంబంధమని ఆయన అన్నారు. ప్రజల ఆదరాభిమానాల పొందిన తాను ఎంతో పుణ్యం చేసుకున్నానని, ఇది తన జన్మఫల సుకృతమని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, March 18, 2009, 15:06 [IST]