హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను బెదిరించలేదు: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: 108 అంబులెన్సులపై రాజీవ్‌ గాంధీ బొమ్మ విషయంలో తాను ఎన్నికల అధికారిని బెదిరించానని, బ్లాక్‌ మెయిల్‌ చేశానని మహాకూటమి నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆర్థికమంత్రి రోశయ్య అన్నారు. దీనిపై తాను గౌరవంగా వినతిపత్రం ఇచ్చానని, ఆ సమయంలో తనకున్న అనుమానాలు వ్యక్తం చేశానని అన్నారు. బ్లాక్‌ మెయిల్‌ చేసే విద్యలో కొందరికే ప్రావీణ్యం ఉంటుందని అలాంటి విద్య తనకు రాదని అన్నారు. వేగంగా వెళ్లే వాహనంపై ఏం బొమ్మ ఉందో ఎలా తెలుస్తుందని, దాన్ని చూసి ఓటర్లు ప్రభావితులవుతారని అనుకోవటం అవివేకమని ఆయన అన్నారు.

కాగా, నామాలు పెట్టుకుని తిరగాలని సిపిఎం నేత బివి రాఘవులు మంత్రి రోశయ్యపై చేసిన వ్యాఖ్యపై కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అంబులెన్స్ పై రాజీవ్ గాంధీ బొమ్మ కనిపించకుండా చేయాలని మాత్రమే తాను అధికారికి సూచించానని రోశయ్య చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X