తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సామాజిక న్యాయం వల్లే అసంతృప్తి: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించడం వల్లనే అసంతృప్తి చెలరేగుతోందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఆయన ప్రజా అంకిత యాత్ర సోమవారంనాడు తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన రాజమండ్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సామాజిక న్యాయం పాటించాలనే ఉద్దేశంతో కసరత్తు చేయడం వల్లనే అభ్యర్థుల జాబితా వెల్లడిలో జాప్యం జరిగిందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో టిక్కెట్లు దొరకని నాయకులు చిత్తశుద్ధితో పని చేస్తే భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తాను వచ్చే నెల 3వ తేదీన పాలకొల్లులో, 4వ తేదీన తిరుపతిలో నామినేషన్లు వేస్తానని ఆయన చెప్పారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే తమ పార్టీ నేత టి.దేవేందర్ గౌడ్ ను రెండు స్థానాల నుంచి పోటీకి దింపినట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ అభ్యర్థుల మలి జాబితాను అల్లు అరవింద్ సోమవారం సాయంత్రం విడుదల చేస్తారని ఆయన చెప్పారు. అభ్యర్థుల జాబితాకు సంబంధించి అల్లు అరవింద్ విశాఖపట్నంలోని దసపల్లా హోటల్లో కసరత్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X