ముఖ్యమంత్రిగా వైయస్ ప్రమాణం

ముఖ్యమంత్రిగా గతంలో ప్రమాణం చేసినప్పుడు ఉచిత విద్యుత్ పై సంతకం చేసిన వై.ఎస్ ఈసారి ప్రమాణస్వీకారం అనంతరం రెండు ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను 7నుంచి 9 గంటలకు పెంచుతూ ఓ ఫైలుపై, సబ్సిడీ బియ్యం కుటుంబానికి 25 నుంచి 30 కిలోలకు పెంచుతూ మరో ఫైలుపై ఆయన సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.
రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారానికి హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని ప్రధాన కూడళ్లను కాంగ్రెసు కార్యకర్తలు అలంకరించారు. వైయస్ ప్రమాణ స్వీకారోత్సవానికి లక్ష మందికి పైగా హాజరు కావచ్చునని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానం పంపలేదు. ఎవరైనా హాజరు కావచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications