తాలిబన్ నేత అమీర్ ఇజ్జాత్ మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని శిఖాకోట్ ఘర్షణలో తాలిబన్ అగ్రనేత అమీర్ ఇజ్జాత్ మృతి చెందాడు. పాక్ సైన్యానికి తాలిబన్లకు జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇజ్జాత్ మృతి చెందినట్లు పాక్ సైన్యం తెలిపింది. సూఫీ మహ్మద్ డిప్యూటీగా ఉన్న ఇజ్జాత్ ను కోల్పోవడం తాలిబన్లకు మరో దెబ్బ.
మిలిటెంట్లు స్వాత్ లోయలో ప్రిజన్ కాన్వాయ్ పై మెరుపు దాడి చేశారని, ఈ దాడిలో ఇద్దరు మరణించారని పాక్ సైన్యం తెలిపింది. ఖైదీలను కాన్వాయ్లో స్వాత్ కు సమీపంలోని శిఖాకోట్ నుంచి పెషావర్ కు శనివారం ఉదయం తీసుకుని వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఒక సైనికుడితో పాటు ఇద్దరు ఖైదీలు మరణించారు.
మరణించిన ముహమ్మద్ ఆలం, అమీర్ ఇజ్జాత్ సూఫీ మహ్మద్ సహాయకులు. తాలిబాన్లతో ప్రభుత్వం శాంతి ఒప్పందాన్ని కుదిర్చింది ఈ సూఫీ మహమ్మదే. తాలిబాన్లు స్వాత్ లోయతో ఆగకుండా సమీప జిల్లాలకు విస్తరిస్తుండడంతో ఒప్పందానికి విఘాతం కలిగింది.