ఢిల్లీలో అదృశ్యం: సిటీలో ప్రత్యక్షం
హైదరాబాద్: ఏడు నెలల క్రితం ఢిల్లీలో కిడ్నాపైన ఓ మహిళ హైదరాబాద్లో ప్రత్యక్షం అయింది. చిత్తూరులో తనను ఏడు నెలలుగా రసూల్ అనే వ్యక్తి హింసిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడు నెలలుగా చిత్తూరులోని ఒక గదిలో నిర్బంధించి అత్యాచారం జరిపిన రసూల్ అనే వ్యక్తి ఆమెను హైదరాబాదులోని చార్మినార్ వద్ద వదిలి వెళ్లిపోయాడు.
ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నారు. లక్ష్మి అనే ఆ మహిళను అబ్జర్వేషన్ హోంలో ఉంచి ఢిల్లీ పోలీసులకు తెలియజేశారు. దీంతో ఆమెను తీసికెళ్లడానికి పోలీసులు హైదరాబాదు బయలుదేరారు. ఆమె అదృశ్యంపై ఢిల్లీలో కేసు నమోదై ఉంది.
Comments
Story first published: Tuesday, June 23, 2009, 15:36 [IST]