బాలకృష్ణనే అంగీకరించారు: సోమిరెడ్డి
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ లేఖాస్త్రాలు సంధిస్తున్న తిరుగుబాటు నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్థి అని బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని, అప్పుడెందుకు ప్రసన్నకుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు. చంద్రబాబుపై మాట్లాడడానికి నువ్వెంత అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన నెల తర్వాత విమర్శలు చేయడంలో అర్థమేమిటని ఆయన అడిగారు. ఏనుగు నడుస్తుంటే కుక్కలు మొరుగుతాయని, అలాగే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారం ఉందని ఆయన అన్నారు.
ప్రసన్న కుమార్ రెడ్డి మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని, ప్రసన్నకుమార్ రెడ్డి మానసిక పరిస్థితి బాగా లేదని ఆయన సోదరుడు రాజేంద్రకుమార్ రెడ్డే చెప్పారని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పార్టీ నుంచి కోటగిరి విద్యాధరరావు, తమ్మినేని సీతారాం లాంటి వాళ్లు వెళ్లిపోయారని, వారెవరు కూడా ప్రసన్నకుమార్ రెడ్డిలా మాట్లాడలేదని ఆయన అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడుతున్నారనేది బహిరంగ రహస్యమేనని ఆయన అన్నారు.
-
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
మూడు రోజులు వర్షాలు.. వరుణ సందేశం ఇచ్చిన వాతావరణ శాఖ! -
బాలయ్యతో KGF ను మించిన యాక్షన్ డ్రామా.. 2 భాగాలుగా తొలిసారి -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications