బాలకృష్ణనే అంగీకరించారు: సోమిరెడ్డి
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ లేఖాస్త్రాలు సంధిస్తున్న తిరుగుబాటు నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్థి అని బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని, అప్పుడెందుకు ప్రసన్నకుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు. చంద్రబాబుపై మాట్లాడడానికి నువ్వెంత అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన నెల తర్వాత విమర్శలు చేయడంలో అర్థమేమిటని ఆయన అడిగారు. ఏనుగు నడుస్తుంటే కుక్కలు మొరుగుతాయని, అలాగే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారం ఉందని ఆయన అన్నారు.
ప్రసన్న కుమార్ రెడ్డి మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని, ప్రసన్నకుమార్ రెడ్డి మానసిక పరిస్థితి బాగా లేదని ఆయన సోదరుడు రాజేంద్రకుమార్ రెడ్డే చెప్పారని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పార్టీ నుంచి కోటగిరి విద్యాధరరావు, తమ్మినేని సీతారాం లాంటి వాళ్లు వెళ్లిపోయారని, వారెవరు కూడా ప్రసన్నకుమార్ రెడ్డిలా మాట్లాడలేదని ఆయన అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడుతున్నారనేది బహిరంగ రహస్యమేనని ఆయన అన్నారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
నరసింహ నాయుడు, ఘరానా మొగుడు.. ఈ రెండు ఇండస్ట్రీ హిట్లలో ఏది బెస్ట్?












Click it and Unblock the Notifications