నదిలో బస్సు పడి 12 మంది గల్లంతు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బస్సు భాగీరథి నదిలో పడి ముగ్గురు మరణించగా 12 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం ఉత్తరకాశి జిల్లాలో శుక్రవారం సంభవించింది. నదిలోంచి మూడు మృతదేహాలను వెలికి తీశారు. తొమ్మిది మంది గాయపడినట్లు అధికార వర్గాలు చెప్పాయి. బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. బస్సులో చాలా మంది శివుడి భక్తులున్నారు. బస్సు గంగోత్రి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications