తలసానిపై చంద్రబాబు సీరియస్

Talasani Srinivas Yadav
హైదరాబాద్‌: రహస్యంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసిన తమ పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తలసాని వ్యవహారంపై చర్చించేందుకు ఆయన మంగళవారంనాడు సీనియర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తలసాని శ్రీనివాస యాదవ్ బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. శ్రీనివాస యాదవ్ పై వేటు వేసే విషయంపై చంద్రబాబు పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది.

సమైక్యవాదాన్ని అందుకుని తెలుగుదేశం తెలంగాణ అనుకూల వైఖరిని ప్రశ్నించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కొద్ది రోజుల క్రితం చంద్రబాబుతో భేటీ అయి రాజీకి వచ్చినట్లే కనిపించారు. దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబుతో చర్చించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో ఉంటానని చెప్పారు. మాటకు కట్టుబడకుండా మళ్లీ కాంగ్రెసు వైపు తలసాని చూస్తుండడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు.

కాగా, ముఖ్యమంత్రితో భేటీపై మాట్లాడడానికి తలసాని శ్రీనివాస యాదవ్ సిద్ధంగా లేరు. ఆయన మీడియాకు ముఖం చాటేస్తున్నారు. కాంగ్రెసులో చేరిపోవడానికే ఆయన సిద్ధపడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+