మరిన్ని కేంద్ర నిధులు: వైయస్

సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రత్యేక గ్రాంట్లు ఏర్పాటు చేయాలని, ఉచిత విద్యుత్ కు కేంద్ర సాయం అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సామాజిక సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని, ఉదాహరణకు నక్సల్స్ సమస్య పరిష్కారం ఆర్థికాభివృద్ధితోనే ముడబడి ఉందని ఆయన అన్నారు. ప్రణాళికా వ్యయంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆయన చెప్పారు. కృష్ణా, గోదావరి బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్రం ఇచ్చే పన్నుల వాటాను 30.5 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications