సాయిరాంకు ఉస్మాయాలో మెడికల్ సీటు
హైదరాబాద్: ఎంసెట్ తొమ్మిదో ర్యాంకర్ సాయిరాం ఎట్టకేలకు మెడికల్ సీటు సంపాదించాడు. అతనికి ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు కేటాయించారు. బిసి కోటా కింద అతను సీటు తీసుకున్నాడు. వయోపరిమితి సరిపోలేదని అంటూ కౌన్సెలింగులో తొలుత అతనికి మెడికల్ సీటు కేటాయించడానికి అధికారులు నిరాకరించారు. అయితే హైకోర్టు జోక్యంతో అతనికి అధికారులు సీటు కేటాయించారు.
భారత వైద్య మండలి (ఎంసిఐ) నిబంధనల ప్రకారం ఎంబిబియస్ కోర్సులో చేరడానికి విద్యార్థికి 17 ఏళ్లు దాటి ఉండాలి. సాయిరాంకు 17 ఏళ్లకు 15 రోజులు తక్కువగా ఉన్నాయంటూ సోమవారం సీటు నిరాకరించారు. వయోపరిమితిని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా వారు ఖాతరు చేయలేదు. దీంతో సాయిరాం హైకోర్టును ఆశ్రయించాడు. వయస్సును మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అంటూ కోర్టు సాయిరాంను కౌన్సెలింగుకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది. అయితే అడ్మిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో అధికారులు సాయిరాంకు సీటు కేటాయించారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications