నివేదికల మేరకే భద్రత: సబిత

Sabitha Indra Reddy
హైదరాబాద్: జిల్లా కమిటీలు ఇచ్చిన నివేదికల మేరకే రాజకీయ పార్టీల నేతలకు భద్రత కల్పిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాజకీయ పార్టీల నాయకులకు కల్పించిన భద్రతపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చకు ఆమె సమాధానమిచ్చారు. వివిధ పార్టీలకు చెందిన 732 మంది నాయకులకు భద్రత కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా కమిటీలు, ఎస్పీలు ఇచ్చిన నివేదికల మేరకే నాయకులకు భద్రత ఉంటుందని ఆమె అన్నారు. కొన్ని సమయాల్లో కోర్టు ఆదేశాల మేరకు నాయకులకు భద్రత కల్పిస్తామని ఆమె అన్నారు.శత్రువు నుంచి ముప్పు ఉందని ఎవరైనా విజ్ఞప్తి చేస్తే భద్రత పెంచుతామని ఆమె చెప్పారు. భద్రత కుదించినవారిలో తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కాంగ్రెసు నాయకులే అధికంగా ఉన్నారని ఆమె చెప్పారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలకు భద్రత కుదిస్తున్నారని తెలుగుదేశం సభ్యులు అంతకు ముందు ఆరోపించారు. ప్రభుత్వం భద్రత కల్పించే విషయంలో పక్షపాత ధోరణిని అవలంబిస్తోందని తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ విమర్శించారు. ప్రజల్లోకి వెళ్లే నాయకులకు ప్రభుత్వం భద్రత కుదిస్తోందని తెలుగుదేశం సభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనకు భద్రత కుదించిన మర్నాడే తనపై దాడి జరిగిందని ఆయన గుర్తు చేశారు. తనపై దాడి చేసినవారిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు కల్పించిన భద్రతపై చర్చను ఇప్పుడు వాయిదా వేసి మరోసారి చర్చకు అనుమతించాలని తెలుగుదేశం సభ్యులు కోరారు. భద్రత పొందుతున్న నాయకుల వివరాలు వెల్లడించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. హోంమంత్రి ఇచ్చిన వివరణ అసమగ్రంగా ఉందని తెలుగుదేశం నిరసన వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+