ఢిల్లీలో తొలి స్వైన్ ఫ్లూ మృతి?

New Delhi
న్యూఢిల్లీ: ఢిల్లీలో స్వైన్ ఫ్లూతో 35 ఏళ్ల మహిళ మరణించినట్లు అనుమానిస్తున్నారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ఆ మహిళ మరణించింది. ఆమె నమూనాలను పరీక్షలకు పంపారు. ఆమె స్వైన్ ఫ్లూ వల్లనే మరణించిందా, లేదా అనేది పరీక్షల్లో తేలుతుంది. స్వైన్ ఫ్లూ వ్యాధి వల్ల ఆమె మరణించినట్లు తేలితే ఢిల్లీలో ఇదే తొలి స్వైన్ ఫ్లూ మరణం అవుతుంది.

ఆ మహిళ బుధవారం ఆస్పత్రిలో చేరింది. ఆమెను వెంటిలేటర్ పై ఉంచి కృత్రిమ శ్వాసను అందించారు. ఆమె గత రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు గురువారం ఉదయం చెప్పారు. ఆమె ఈ నెల 15వ తేదీన సింగపూర్ నుంచి వచ్చింది. రెండు రోజుల క్రితం నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+