Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ తీరుపై చిరు అసంతృప్తి

Chiranjeevi
విశాఖపట్నం: కరువుపై ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి స్పందించిన తీరు పట్ల ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరువుపై ప్రభుత్వ స్పందన నిరాశాజనకంగా ఉందని ఆయన అన్నారు. టెక్కలి శాసనసభా స్థానం ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ ఆయన సోమవారం కొద్దిసేపు విశాఖపట్నంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలు ఉంటే ముఖ్యమంత్రి కరవుపై స్పందించి ఉండేవారని ఆయన వ్యాఖ్యానించారు. కరవుపై ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన చెప్పారు. ఏజెన్సీల్లో విష జ్వరాలను ప్రజలను వణికిస్తోందని ఆయన అన్నారు. తిరుపతి కోదండరామాలయం స్వామివారి నగల అవకతవకలపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాలను తాకట్టు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగ్ నివేదిక ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

టెక్కలి ఉప ఎన్నికల్లో సీరియస్ గా పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల్లోకి రావడానికి ఇది అవకాశం కల్పించిందని ఆయన చెప్పారు. సీరియస్ గా తీసుకున్నందు వల్లనే శాసనసభా సమావేశాలు ఉన్నా తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎవరూ పోటీ చేయబోమని ప్రకటిస్తే తాము ఆలోచించి ఉండేవారమని ఆయన చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా మాత్రమే ఆలోచిస్తున్నాయి గాని మానవతా దృక్పథంతో ఆలోచించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+