జగన్ పై కోర్ కమిటీ : ప్రధాని

Manmohan Singh
న్యూఢిల్లీ: దివంగత నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న డిమాండ్ పై కాంగ్రెసు కోర్ కమిటీ పరిశీలిస్తోందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. ఈ విషయాన్ని తమతో ప్రధాని చెప్పినట్లు కాంగ్రెసు సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి కుమారులు,పార్టీ నాయకులు వినోద్, వివేక్ చెప్పారు. వారు బుధవారంనాడు ప్రధానిని కలిశారు. వైయస్ మరణించిన తర్వాత సంభవించిన పరిణామాలన్నీ పథకం ప్రకారం జరిగాయని భావించామని, అయితే అవన్నీ ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందనలని గ్రహించామని ప్రధాని అన్నారు. వైయస్ మరణానంతరం జరిగిన ఆత్మహత్యలు, ఆందోళనలు, జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న డిమాండ్ - వీటన్నింటిపై తమకు సమాచారం ఉందని ప్రధాని చెప్పారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ప్రజాస్పందనను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు సభ్యులు, శాసనభ్యుల అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ప్రధాని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రధానే స్వయంగా అడిగారని, దాంతో వైయస్ మరణానంతరం రాజకీయ శూన్యత ఏర్పడిందని తాము చెప్పామని వివేక్, వినోద్ చెప్పారు. అధిష్ఠాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని వారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+