వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ప్రసంగంపై ఆసక్తి

By Sridhar L
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
కడప: వైయస్ రాజశేఖర రెడ్ది సంతాపసభలో ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఆయన పావురాలగుట్టలో తండ్రి మృతికి నివాళులు అర్పించిన అనంతరం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన సంతాప సభలో పాల్గొంటారు. ఆయన ఈ సంతాపసభలో తన భవిష్యత్తు రాజకీయం గురించి మాట్లాడుతారనే ఉద్దేశంతో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జగన్ ను కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి సిద్ధంగా లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిరీక్షణ సాగుతోంది. పార్టీ అధిష్ఠాన వర్గం కూడా జగన్ కార్యక్రమంపై కన్నేసి ఉంచింది.

సంతాపసభలో ఆయన ఎటువంటి రాజకీయ ప్రసంగం చేయబోరని నిర్వాహకులు చెబుతున్నారు. సంతాపసభలో ప్లకార్డులు ప్రదర్శించకూడదని, నినాదాలు చేయవద్దని నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. అయితే జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అటువంటివి చోటు చేసుకునే అవకాశం ఉదని భావిస్తున్నారు. జగన్ పాల్గొనే సంతాపసభలో నినాదాలు చేయడానికి కుట్ర చేస్తున్నారని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. వైయస్ కు శ్రద్ధాంజలి ఘటించేందుకు మాత్రమేనని నిర్వాహకులు అంటున్నారు.

వైయస్ మృతితో తీవ్ర కలత చెందిన అభిమానుల గురించి ఆయన మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. తమ కుటుంబం పట్ల చూపిన సానుభూతికి ఆయన కృతజ్ఝతలు తెలిపే అవకాశం ఉంది. గందరగోళం సృష్టించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X