వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మల్లు భట్టి హై కమాండ్ ను బట్టి...

By Santaram
|
Google Oneindia TeluguNews

Bhatti Vikramarka
హైదరాబాద్: కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వ చీఫ్‌విప్‌ మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అధిష్ఠానం ఓ పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుందని, దానికి ప్రతి కాంగ్రెస్‌ నేతా కట్టుబడి ఉంటారని ఆయన చెప్పారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో మల్లు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని, అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని, వ్యతిరేకించేవారు ఎవరూ ఉండరని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ను సీఎం చేయకపోతే రాజీనామా చేస్తామని కొందరు మంత్రులు చెబుతున్నారు కదా అన్న ప్రశ్నకు.. అవన్నీ వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలని మల్లు పేర్కొన్నారు.

కాగా, ఇందిరమ్మ రాజ్యం తెస్తాననే వైఎస్‌ కాంగ్రెస్‌ను గెలిపించారని ఎమ్మెల్యే శంకర్‌రావు చేసిన వాఖ్యలపై చీఫ్‌ విప్‌ విక్రమార్క ఆచితూచి స్పందించారు. 'ఆయన సీనియర్‌ నేతగా తన అభిప్రాయాలు చెప్పారు. దాంట్లో తప్పేమీలేదని భావిస్తున్నాను. కాంగ్రెస్‌ ప్రతి కార్యకర్తా పార్టీ సిద్ధాంతాలు, విధానాలతోనే గెలిచారని భట్టి వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X