హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కార్యాలయం వద్ద రాజకీయ సందడి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్ నివాసం ఉంటున్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర రాజకీయ సందడి నెలకొని ఉంది. జగన్ ను కలవడానికి మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు వస్తున్నారు. పలువురు మంగళవారం కూడా ఆయనను కలిశారు. మంత్రులు డికె అరుణ, వట్టి వసంతకుమార్, ఆనం రాంనారాయణ రెడ్డి, కొండా సురేఖ, నాయకులు మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ్యులు, నాయకులు ఆయనను కలిసినవారిలో ఉన్నారు. జగన్ సోమవారం హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి ఆయన నివాసం వద్ద రాజకీయ సందడి చోటు చేసుకుంది.

తమ కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పి.శంకరరావు చేసిన వ్యాఖ్యలపై జగన్ ను కలిసిన శాసనసభ్యులు తీవ్రంగా మండి పడుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల పార్టీ అభ్యర్థులు గెలవలేదని, వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల 10 శాతం మాత్రం ఫలితం మాత్రమే ఉందని శంకర రావు సోమవారం అన్నారు. వైయస్ వల్ల గెలిచామనే వారు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. దీనిపై శాసనసభ్యులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకరరావు రాజీనామా చేసి తిరిగి గెలవాలని వారు సవాల్ చెశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X