వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Padmavathi Mahila University
తిరుపతి: తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న జ్యోత్స్న అనే విద్యార్థిని విశ్వవిద్యాలయంలోని గాయత్రి బ్లాక్ హాస్టల్లో ప్రాణాలు తీసుకుంది. సహ విద్యార్థినులు కాలేజీకి వెళ్లిపోయిన తర్వాత ఆమె గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్ కు చెందిన జ్యోత్స్న ఆత్మహత్యకు పలు కారణాలు చెబుతున్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు, ఆనారోగ్య కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు మరి కొందరు చెబుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ లేఖ రాసిపెట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా, మృతురాలి వివరాలు చెప్పేందుకు విశ్వవిద్యాలయం అధికారులు నిరాకరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X