కాంగ్రెసు హైకమాండ్ పై సురేఖ గుర్రు

Konda Surekha
హైదరాబాద్: కాంగ్రెసు అధిష్టానంపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ ను పార్టీ అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించలేదని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ సంఘ్వీ చేసిన ప్రకటనపై ఆమె తీవ్రంగా ప్రతిస్పందించారు. మంత్రులు కొండా సురేఖ, శిల్పా మోహన్ రెడ్డి మంగళవారంనాడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు. జగన్ తో భేటీ అనంతరం సురేఖ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సంఘ్వీ ప్రకటన ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, పార్టీ శాసనసభ్యులు, కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీసిందని ఆమె అన్నారు.

జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న డిమాండ్లకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేతలు మాట్లాడినప్పుడు స్పందించని అధిష్ఠానం జగన్ కు ఢిల్లీ పిలువు వచ్చిందని కొందరు చేసిన ప్రకటనపై వెంటనే ఎందుకు ప్రతిస్పందించిందని ఆమె అడిగారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందనడంలో అతిశయోక్తి లేదని ఆమె అన్నారు. తాము గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నామని ఆమె అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని ఆమె అన్నారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం విషయంలో రోశయ్య మాట్లాడకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి సంతాపం ప్రకటించడానికి శాసనసభా సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉందని ఆమె అన్నారు. అలాగే సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి నేతను ఎన్నుకోవడం అవసరమని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+