జగన్ తండ్రి బాటలో నడవాలి: రోశయ్య

YS Jagan
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తండ్రి బాటలో నడిచి కాంగ్రెసు పార్టీలో గొప్ప నాయకుడిగా ఎదగాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య సూచించారు. జగన్ కు, జగన్ వర్గానికి మీరిచ్చే సలహా ఏమిటని మంగళవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఒక మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు ఆయన ఆ విధంగా సలహా ఇచ్చారు. వైయస్ జగన్ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జగన్ తండ్రి బాటలో ప్రయాణం చేస్తూ కాంగ్రెసు పార్టీలో గొప్ప నాయకుడిగా ఎదిగేలా సహకరించాలని తాను జగన్ మిత్రులకు కూడా సలహా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

మంత్రుల పనితీరును బేరీజు వేసి తగిన చర్యలు తీసుకునే విషయంలో తాను వైయస్ రాజశేఖర రెడ్డి మార్గంలోనే నడుస్తానని ఆయన చెప్పారు. మంత్రులు విపత్తు తర్వాత విపత్తును ఎదుర్కుంటున్నారని, పనితీరును అంచనా వేసి చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. ప్రాజెక్టులను, సంక్షేమ పథకాలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతానని ఆయన చెప్పారు. అర్థిక పరిస్థితి విషయంలో ఒత్తిడి ఉన్న మాట నిజమేనని, అయితే అది అధిగమించలేనంతగా ఏమీ లేదని, ఉన్నదాంట్లో సర్దుకోవడమే తన మార్గమని, అనవసరమైన ఆడంబరాలకు పోదలుచుకోలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+