నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చూపు తీసిన కంటి చికిత్స: విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Bollineni Hospital
నెల్లూరు: నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రిలో కంటి శస్త్ర చికిత్సలు వికటించి 13 మంది కంటి చూపు కోల్పోయిన సంఘటనపై జిల్లా కలెక్టర్ రాంగోపాల్ సోమవారం విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు బొల్లినేని ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు నిలిపేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి మంజుల నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కలెక్టర్ విచారణకు నియమించారు. విచారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.

వారం రోజుల క్రితం బొల్లినేని కంటి ఆస్పత్రి రెండు ఉచిత శిబిరాలు నిర్వహించి కంటి శస్త్ర చికిత్సలు చేసింది. నెల్లూరులోని కంటి ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న గ్లోబల్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన ఇందుకూరు పేట, శ్రామిక నగర్, నవాబ్ పేటల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించారు. వారు 34 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. అయితే పలువురికి ఇన్ ఫెక్షన్ సోకింది. దీంతో 13 మంది కంటి చూపు కోల్పోయారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 16 మందిని చెన్నైకి తరలించారు.

కంటి ఆపరేషన్ కు వాడిన మందులు, పరికరాలను పరీక్షల కోసం పంపిననట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. చెన్నై నుంచి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని బొల్లినేని కంటి ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X