చూపు తీసిన కంటి చికిత్స: విచారణ
వారం రోజుల క్రితం బొల్లినేని కంటి ఆస్పత్రి రెండు ఉచిత శిబిరాలు నిర్వహించి కంటి శస్త్ర చికిత్సలు చేసింది. నెల్లూరులోని కంటి ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న గ్లోబల్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన ఇందుకూరు పేట, శ్రామిక నగర్, నవాబ్ పేటల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించారు. వారు 34 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. అయితే పలువురికి ఇన్ ఫెక్షన్ సోకింది. దీంతో 13 మంది కంటి చూపు కోల్పోయారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 16 మందిని చెన్నైకి తరలించారు.
కంటి ఆపరేషన్ కు వాడిన మందులు, పరికరాలను పరీక్షల కోసం పంపిననట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. చెన్నై నుంచి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని బొల్లినేని కంటి ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.
Comments
Story first published: Monday, October 26, 2009, 13:27 [IST]