హైదరాబాద్: మావోయిస్టులపై ఎలాంటి సైనిక ఆపరేషన్లు చేయడం లేదని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తెలిపారు. హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారుల ఔట్పాసింగ్ పరేడ్కు హాజరైన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గ్రీన్ హంట్ లాంటివి ఏవీ లేవని కేవలం ఇది మీడియా సృష్టి మాత్రమేనని స్పష్టం చేశారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బలగాలను మోహరించారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అయితే మావోయిస్టుల అణచివేతకు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సాయం ఉంటుందన్నారు.