తెలంగాణ ఇవ్వకుంటే బలిపీఠం తప్పదు: కెసిఆర్

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోతే బలిపీఠం తప్పదని తాను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు చెప్పారు. తన పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన సోమవారం రాష్ట్రపతిని కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం గురించి ఆయన రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. తాను చేపట్టదలచిన ఆమరణ నిరాహార దీక్ష గురించి తెలియజేశానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దోపిడీని, కష్టాలను సహించేకంటే ఆత్మార్పణమే మేలని ఆయన అన్నారు.

తాను ఆమరణ నిరాహార దీక్ష గురించి చెప్పినప్పుడు అంత కఠిన నిర్ణయం వద్దని ప్రతిభా పాటిల్ సూచించారని, అయితే తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దోపిడీని సహించే కన్నా ఆత్మార్పణమే మేలని తాను అన్నానని ఆయన చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి, రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు, ఆకలి చావులకు గురవుతున్న విషయం గురించి తాను రాష్ట్రపతికి వివరించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు గత రాష్ట్రపతి హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ప్రతిభా పాటిల్ కు తెలిపినట్లు ఆయన చెప్పారు. తాను అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+