ఓటు వేసిన టెన్నిస్ స్టార్ సానియా
కాగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటింగ్ మందకొడిగానే సాగింది. సోమవారం మధ్యాహ్నం వరకు కూడా 33 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ సందర్భంగా చెదురు మొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. దారుల్ షఫాలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద మజ్లీస్, ఎంబిటీ, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. పాతబస్తీలోని నూర్జాన్ బజారులోని పోలింగ్ కేంద్రంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఫర్నీచర్, ఓటింగ్ యంత్రాలు దెబ్బ తిన్నాయి. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.
బాగ్ లింగంపల్లిలో లోకసత్తా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ ఏజెంట్లకు ఆహార పొట్లాలు అందిస్తుండగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని లోకసత్తా కార్యకర్తలు చెబుతుండగా డబ్బులు పంచడం వల్లనే పోలీసులు అందుకు ఒడిగట్టారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.ఒక చోట బిజెపి కార్యకర్తలు ధర్నాకు కూడా దిగారు.