వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహం : బాబు వర్సెస్ పురంధేశ్వరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari
న్యూఢిల్లీ: పార్లమెంటులో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, కేంద్ర మంత్రి పురంధేశ్వరికి మధ్య వివాదం చెలరేగుతోంది. ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించే అవకాశం తమకు ఇవ్వాలని చంద్రబాబు ఒక వైపు పట్టుబడుతుంటే, తమకే ఇవ్వాలని దగ్గుబాటి పురంధేశ్వరి మరోవైపు పట్టుబడుతున్నారు. స్వర్గీయ జిఎంసి బాలయోగి లోకసభ స్పీకర్ గా ఉన్నప్పుడు పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించే అంశం ముందుకు వచ్చింది.

తమ చొరవ వల్లనే ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు అవకాశం వచ్చిందని, తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అందుకు తగిన కృషి చేశానని కాంగ్రెసు శాసనసభ్యుడు, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు అంటున్నారు. కాదని, తామే అందుకు చొరవ ప్రదర్శించామని తెలుగుదేశం నాయకుడు కె. ఎర్రంనాయుడు అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనను పట్టించుకోలేదని దగ్గుబాటి చెబుతున్నారు. కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జాప్యం జరుగుతుండడంతో విగ్రహాన్ని ఇవ్వడానికి పురంధేశ్వరి ముందుకు వచ్చినట్లు ఆయన చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X