హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మజ్లీస్ తో చంద్రబాబు 'గ్రేటర్' దోస్తీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని కైవసం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన పార్టీ ముఖ్య నేతలతో ఆయన గురువారం సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీలో ఆనందం వ్యక్తమవుతోంది. అంచనాలకు మించి విజయం సాధించడంతో చంద్రబాబు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలు కాంగ్రెసు పట్ల ప్రజల ఆదరణ తగ్గుతుందనడానికి నిదర్శనమని ఆయన భావిస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసును హైదరాబాదులో అధికారానికి దూరం చేయాలనే ఎత్తుగడలతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన మజ్లీస్ తో దోస్తీకి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.

చంద్రబాబు ఆలోచనకు కొంత మంది ముఖ్య నాయకులు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. మత పార్టీలకు దూరంగా ఉండాలనే తమ ఆశయానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల ప్రజలు దూరమవుతారని వారు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వాడుకోవాలని వారు చెబుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 45 స్థానాలు గెలుచుకుని కాంగ్రెసు పార్టీకి సవాల్ విసిరినట్లుగా వారు భావిస్తున్నారు. అధికారం పంచుకోవడానికి ఇప్పటికే తెలుగుదేశం, మజ్లీస్ పార్టీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X