హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగతనం చేసినట్టు ఏమిటీ వేధింపులు: కెసిఆర్

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ నేతలకు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ అధినేత తీవ్రంగా మండిపడ్డారు. తామేమి తప్పు చేసినమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 'మా ఎంపీలు, ఎమ్మెల్యేలకు బైండోవర్‌ నోటీసుల జారీ చేయడానికి దొంగతనం చేసినమా?..చట్టాన్ని ఉల్లంఘించినమా?.. పది సంవత్సరాల చరిత్రలో ఎవరినైనా చంపినమా?...బస్సులు తగులబెట్టినమా?.." అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

పలు కారణాల రీత్యా వేర్వేరు పార్టీలు, సంఘాలలో తెలంగాణ వారు ఉన్నా సందర్భమొచ్చిందంటే అందరూ ఒక్క గుద్దు గుద్దుతారని కెసీఆర్‌ హెచ్చరించారు. శాంతియుతంగా దీక్ష చేస్తామంటే చేయనీయరా? అని ప్రశ్నించారు. మీడియాపై కూడా కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. అనవసరంగా తమపై తప్పుడు వార్తలు, కార్టూన్లు ప్రసారం చేస్తే సహించేది లేదన్నారు. తెలంగాణ గడ్డపై స్టూడియోలు ఉండాలనుకుంటున్నారా?.. లేదా?.. అని ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X