అనివార్య స్థితిలోనే అమ్మను తెచ్చాం: జగన్

YS Jagan
కడప: అనివార్యమైన పరిస్థితిలోనే అమ్మ విజయలక్ష్మిని రాజకీయాల్లోకి తీసుకొచ్చామని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి నామినేషన్ వేయడానికి ముందు మంగళవారం పులివెందులలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైయస్ జగన్ ప్రసంగించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి మేరకే విజయమ్మ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చెప్పారు. సోనియా గాంధీ ఏది చేసినా ఆలోచించే చేస్తారని, సోనియాపై తనకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు. పులివెందుల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా తన తల్లి విజయమ్మ పేరును ఖరారు చేసినందుకు ఆయన సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు.

పులివెందుల వైయస్సార్ కుటుంబానికి కంచుకోట అని ఆయన అన్నారు. పులివెందుల ఖ్యాతిని దేశానికి, రాష్ట్రానికి చాటుతామని ఆయన అన్నారు. అందరి సహకారంతో తాను రాష్ట్ర నేతగా ఎదుగుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు. తన తల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాన్న వైయస్సార్ లేని లోటును భర్తీ చేసే బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు హాజరయ్యారు. ఆనం వివేకానంద రెడ్డి, కొండా సురేఖ సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద విజయలక్ష్మి నివాళులర్పించారు. ఈ సమయంలో ఆమె కంట తడి పెట్టుకున్నారు. వైయస్సార్ కుటుంబ సభ్యులు సమాధి వద్దకు చేరుకుని విజయలక్ష్మి నామినేషన్ పత్రాలను సమాధిపై ఉంచారు. నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు వైయస్ కు నివాళులర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+