బెజవాడ-గుంటూరు మధ్య ఫుడ్ కోర్టు

ఇందుకోసం ఆరు నుంచి పదెకరాల స్ధలం అవసరమౌతుంది. నెం.5 జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఫుడ్కోర్టు ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ ప్రాంతంలో భూముల విలువ కోట్ల రూపాయలు ఉండడంతో ప్రభుత్వ, దేవాదాయ స్థలాలు ఏమైనా ఉన్నాయా? అనే దిశగా కలెక్టర్ పరిశీలన జరిపారు.
కొలనుకొండలోని 50/1ఎ లో ఉన్న విశ్వేశ్వరస్వామి దేవస్థాన భూములు మూడెకరాలతో పాటు, భోగేశ్వరస్వామి దేవాలయ భూములను కూడా కలెక్టర్ పరిశీలించారు. రెవెన్యూ అధికారుల నుంచి రికార్డులు తెప్పించి చూశారు. అంతకు ముందు కాజ గ్రామంవద్ద ఉన్న చెరువు పోరంబోకును కలెక్టర్ పరిశీలించారు.












Click it and Unblock the Notifications