ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా శవం కోసం రండి: ఫ్యామిలీతో కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
ఖమ్మం: తన శవాన్ని తీసుకుపోవడానికి మాత్రమే రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. కెసిఆర్ చెప్పిన విషయాలను ఆయన తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావు బుధవారం ఉదయం మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. కెసిఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందని, అందువల్ల సెలైన్ ఎక్కించామని జిల్లా కలెక్టర్ ఉషారాణి చెప్పిన మరు క్షణమే ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులెవరూ లేని సమయంలో దొంగ రాత్రి కెసిఆర్ కు సెలైన్ ఎక్కించారని ఆయన చెప్పారు. అలా అయితే దీక్ష భగ్నమైనట్లో కాదో విజ్ఞులే ఆలోచించాలని ఆయన అన్నారు. కెసిఆర్ మాత్రం ఏమీ తీసుకోవడానికి సిద్ధంగా లేరని, కెసిఆర్ ప్రతిఘటిస్తున్నా పట్టించుకోకుండా అధికారులు సెలైన్ ఎక్కించారని ఆయన అన్నారు.

తన వద్ద కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఉండవద్దని, తన శవాన్ని తీసుకుపోవడానికి మాత్రమే రావాలని కెసిఆర్ చెప్పినట్లు కెటిఆర్ తెలిపారు. తనను హైదరాబాద్ తరలించాలని కూడా విజ్ఞప్తులు చేయవద్దని కెసిఆర్ చెప్పారు. తనకు బెయిల్ అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని రామారావు అన్నారు. తాము మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు కెసిఆర్ వద్ద ఉన్నామని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని ఆయన అన్నారు. మానవ హక్కుల కమిషన్ నివేదిక ఆధారంగానే కెసిఆర్ కు సెలైన్ ఎక్కించామని అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X